సినిమాలో చరిత్ర గురించి పట్టించుకోను : కేంద్రమంత్రి ముఖ్తార్

SMTV Desk 2017-11-13 11:36:44  Union Minister Mukhtar Abbas Naqvi, Comments on Padmavathi movie.

న్యూఢిల్లీ, నవంబర్ 13 : "పద్మావతి" చిత్రం రాజ్ పుత్ వంశస్తుల చరిత్రను వక్రీకరించి తీస్తున్నారని ఆరోపిస్తూ ఆ సినిమాను నిలిపివేయాలని ఆ వంశానికి చెందిన ఓ వ్యక్తి నేరుగా ప్రధానికే లేఖ రాశాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఎలాంటి అభ్యంతరాలు లేవని ఇటీవల సుప్రీం కోర్టు స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. కాగా ఈ విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ మాట్లాడుతూ.. "నేనైతే సినిమాను సినిమాలానే చూస్తాను. అంతేగాని చరిత్ర, భౌగోళిక అంశాలు వంటి వాటి గురించి అస్సలు పట్టించుకోను, సినిమాలో నచ్చిన అంశాలను ఆస్వాదించి, నచ్చని విషయాలను వదిలేస్తా. ఇప్పుడు ఈ పద్మావతి చిత్రంపై వస్తున్న ఆరోపణల విషయంలో కూడా అంతే. ఈ సినిమాలో చరిత్ర గురించి కాకుండా కేవలం ఒక సినిమాగానే ఆస్వాదిస్తా. అలాగని ఈ సినిమాను సమర్థించను, అలాగని వ్యతిరేకించను" అంటూ తెలిపారు.