ముంబాయి, నవంబర్ 12 : పాకిస్థాన్ కు స్వాతంత్ర్యం కావాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్. స్పందించారు. ఆయన తన ట్విట్టర్ వేదికగా... " ఫరూక్ అబ్దుల్లా గారు, నమస్కారం. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. జమ్ముకశ్మీర్ మనది. పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) వారిది. ఇదే కశ్మీర్ సమస్యకు పరిష్కారం. నా వయసు 65 ఏళ్లు. చనిపోయేలోగా పాకిస్థాన్ ను చూడాలనేది నా కోరిక. మా పిల్లలు పాక్ లోకి వాళ్ల మూలాలను చూడాలని కోరుకుంటున్నా. జై మాతా దీ", అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వివాదాస్పద ట్వీట్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.