భోపాల్, నవంబర్ 12 : ఈ నెల నవంబర్ 9న మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓట్ల లెక్కింపు నేడు నిర్వహించడం జరిగింది. భాజపా అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి 14,333 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చిత్రకూట్ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్ మరణంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 12 మంది బరిలోకి దిగారు. అయితే భాజపా అభ్యర్థి శంకర్ దయాళ్ త్రిపాఠి, కాంగ్రెస్ అభ్యర్థి నిలాన్షు చతుర్వేది మధ్య గట్టిపోటీ నెలకొనగా, శంకర్ దయాళ్కు 52,677 ఓట్లు రాగ, చతుర్వేది 66,810 ఓట్ల తేడాతో విజయం సాధించారు.