న్యూఢిల్లీ, నవంబర్ 12 : ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. కాలుష్యంతో పాటు పొగమంచు తీవ్రంగా సంభవించడంతో యునైటెడ్ ఎయిర్లైన్స్ న్యూయార్క్-ఢిల్లీ విమాన సర్వీసులు రద్దు చేసింది. శనివారం, ఆదివారం ఢిల్లీకి చేరుకోవాల్సిన విమానాలు రద్దు చేసి ప్రయాణికుల టిక్కెట్లు రీ షెడ్యూల్ చేసినట్లు యునైటెడ్ సంస్థ ప్రకటించింది. దేశరాజధాని ఢిల్లీకి అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య కూడా తగ్గింది. పొగ మంచు కారణంగా గత కొన్ని రోజులుగా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్న విషయం తెలిసిందే. పొగమంచు తగ్గే వరకు ఎదావిధి పరిస్థితులు నేలకోననున్నాయి.