కేసుల నుండి తప్పించుకోవడానికే జగన్ పాదయాత్ర : యనమల

SMTV Desk 2017-11-12 13:42:22  AP Finance Minister, Yanamala Ramakrishnudu, ys jagan controversy

అమరావతి, నవంబర్ 12 : పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు పనామా, పారడైస్ పాత్రలు స్పష్టం చేస్తున్నాయని, వీటిపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తాజాగా జగన్ పై వస్తున్న ఆరోపణలపై సీబీఐ, సీబీడీటీ త్వరితగతిన విచారణ చేపట్టి నిజాలను తేల్చాలని డిమాండ్ చేశారు. జగన్ లాంటి వారికి రాజకీయాలు అవసరమా.? అంటూ ప్రశ్నించారు. కేసులు, అసెంబ్లీ నుంచి తప్పించుకోవడానికే జగన్ పాదయాత్ర మొదలు పెట్టారన్న యనమల రాబోయే ఎన్నికల్లో జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఆయనది ప్రజా సంకల్ప యాత్ర కాదని, రాజకీయాల నుండి విరమించాలన్నదే ప్రజల సంకల్పం అని పేర్కొన్నారు.