ఈ నెల 13 వరకు ఐటీ దాడులు....

SMTV Desk 2017-11-12 12:02:23  Tamil Nadu Chief Minister Jayalalithaa, Shikala, Dinakaran, IT Search

చెన్నై, నవంబర్ 12 : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితులు శశికళ, దినకరన్ ను లక్ష్యంగా చేసుకుని గురువారం ప్రారంభమైన ఆదాయ పన్ను శాఖ దాడులు మూడో రోజు కొనసాగుతున్నాయి. చెన్నైలోని 40 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత వ్యవహారంలో నమధు ఎంజీఆర్ పత్రిక కార్యాలయాల్లో జయ టీవి కార్యాలయంతో పాటు జయ టీవి ఎండీ వివేక్ జయరామన్ ఆయన సోదరి కృష్ణప్రియ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో కోట్ల రూపాయల విలువైన నగదు లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శశికళ బంధువులకు చెందిన బ్యాంకు ఖాతాలను పరీశిలించి రహస్య లాకర్లను గుర్తించారు. ఆమె మంత్రిత్వ పదవులు ఐటీ అధికారులను అడ్డుకొనేందుకు ప్రయత్నించగా వారిని అరెస్టు చేశారు. ఈ నెల 13 వరకు ఈ దాడులు కొనసాగనున్నట్లు సమాచారం.