అమరావతి, నవంబర్ 11 : జగన్ కారణంగానే విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ ను అవినీతి రాష్ట్రామని అంటున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు వారు మీడియాతో మాట్లాడుతూ... ప్యారడైజ్ పేపర్లలో వెల్లడైన నల్లకుబేరుల జాబితాలో జగన్ పేరు కూడా ఉందని తెలిపారు. జగన్ వల్ల మన రాష్ట్రానికి వచ్చిన అవినీతి మచ్చను పోగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అయిపోయినట్టు జగన్ కలలు కంటున్నారని, ఆయనను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయని, అదే జగన్ సీఎం అయితే ఆయన ఆస్తులు మాత్రమే పెరుగుతాయని ఆరోపించారు.