కృష్ణా, నవంబర్ 11 : కృష్ణా జిల్లా జి.కొండూరులో కుక్క మాంసం విక్రయ౦ కలకలం రేపుతోంది. అడవి జంతువు మాంసం పేరిట కొందరు కుక్క మాంసాన్ని విక్రయిస్తున్నారు. మైలవరం జి.కొండూరులోని హోటళ్లకు దీనిని సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఈ మాంసాన్ని విక్రయించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొ౦డూరుకు చెందిన కట్టా ఆదినారాయణ, సేగు లక్ష్మణ్ అనే వ్యక్తులు గ్రామంలోని కుక్కలను చంపి చర్మం తొలగించి మాంసంగా సిద్ధం చేయడమే కాకుండా కిలో రూ.300 నుంచి రూ.400 వరకు అమ్ముతున్నట్లు నిందితులు అంగీకరించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.