హైదరాబాద్, నవంబర్ 11 : హైదరాబాద్ లో కాల్పుల కలకలం చెలరేగి౦ది. మైలార్ దేవ్ పల్లి కింగ్స్ కాలనీలో నివాసం ఉంటున్న ముస్తఫా అనే యువకుడిపై జుబేద్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. అసలు విషయం ఏంటంటే.. జుబేద్ ఆస్తులపై ముస్తఫా ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేయడమే కాకుండా, తనిఖీలు చేయి౦చాడన్న అనుమాన౦తో ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ముస్తఫా శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లగా ప్రస్తుతం అతను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా జుబేద్ వాడిన తుపాకీకి లైసెన్స్ ఉందని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.