బీజింగ్, నవంబర్ 11 : ఈ మధ్య కాలంలో చాలా మంది తమ పనులలో విశ్రాంతి లేకుండా గడపడంతో బయట షాపింగ్ లు తగ్గించేశారు. ఎక్కడ చూసిన ఆన్ లైన్ షాపింగ్ లు, అన్ని వస్తువులు ఒకే దగ్గర దొరకడంతో వినయోగాదారులు కూడా ఈ-కామర్స్ లపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు. సంస్థలు కూడా ఫెస్టివల్ బొనాంజా.. బిగ్ బిలియన్ సేల్స్.. గ్రేట్ ఇండియా సేల్.. అంటూ యూజర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్ లను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా కూడా ఇలాంటిదే ఓ ఆఫర్ సేల్ చేపట్టింది. ‘గ్లోబల్ షాపింగ్ ఫెస్టివల్’ పేరుతో తీసుకొచ్చిన ఈ సేల్కు భారీ డిమాండే వచ్చింది. కేవలం రెండు గంటల్లోనే రూ.77వేల కోట్ల విలువైన వస్తువులు అమ్ముడయ్యాయట. కేవలం 24 గంటలు మాత్రమే ఉండే ఈ ఫెస్టివల్ సేల్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్. గ్లోబల్ షాపింగ్ ఫెస్టివల్ను అలీబాబా 2009లో తొలిసారిగా ప్రారంభించింది.