స్వచ్ఛత పేరుతో మలాన్ని ఎత్తించిన టీచర్స్...

SMTV Desk 2017-11-11 12:44:38  madhya pradesh, Toilets Clean, government school,

మధ్యప్రదేశ్, నవంబర్ 11 : ఉపాధ్యాయులు పిల్లల చేత హోమ్ వర్క్ చేయిస్తారు. కానీ ఇక్కడ మాత్రం వారీ చేత దారుణమైన పనులు చేయిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, పిల్లల చేత టాయిలెట్స్‌ క్లీన్‌ చేయించారు. వివరాల్లోకి వెళితే... మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులు తినడానికి ఉపయోగించే ప్లేట్లతో టాయిలెట్‌ లోని మలాన్ని ఎత్తించారు. స్కూలు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లిన పిల్లలు వారి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని తెలిపారు. దీంతో వారంతా స్కూలు ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఆరోపణలపై ఉపాధ్యాయులు ఖండిస్తూ... స్వచ్ఛత గురించి విద్యార్ధులకు అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారని చెప్పారు. ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.