డానాన్, నవంబర్ 11 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. వియత్నాంలోని డానాన్లో జరుగుతున్న ఆసియా పసిఫిక్ ఆర్ధిక సహకార సమావేశాల సందర్భంగా పరిశ్రమల సీఈవోలతో భేటీ అయిన ట్రంప్ విశాలమైన భారతదేశాన్ని, అక్కడి ప్రజలను ఒక్క ధాటిపై నడిపించడంలో మోదీ విజయవంతమయ్యారని ప్రశంసించారు. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ కూడా అద్భుతమైన వృద్ధిని సాధించడం సహా తమ దేశం మధ్యతరగతి వర్గానికి అనేక అవకాశాలను కల్పించిందన్నారు. 70 ఏళ్ళ స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమవుతున్న భారత్ 130 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతోందన్నారు.