నకిలీ పురుగుమందుల తయారీ ఛేదన!

SMTV Desk 2017-11-10 15:47:25  guntoor updates, about pestisides case in guntoor

గుంటూరు, నవంబర్ 10: గుంటూరు జిల్లాలో మరో నకిలీ పురుగు మందుల తయారీ కేంద్రం గుట్టు బయట పడింది. జిల్లాలోని పిడుగురాళ్ళ కేంద్రంగా సాగుతున్న నకిలీ పురుగు మందు రాకెట్ ను గురువారం విజిలెన్స్ అధికారులు ఛేదించారు. పిడుగురాళ్ల లోని పెద్ద చెరువు వద్ద ఆర్ఎంపీ వైద్యుని ఇంట్లో నకిలీ మందులను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రముఖ కంపెనీ లోగోలు, డబ్బాలు, ఖాళీ కవర్లు, గడువు ముగిసిన మందులను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. కల్తీ ఎరువుల వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు నిర్ఘాంత పోయి, నకిలీ వ్యాపరులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.