న్యూఢిల్లీ, నవంబర్ 9 : విద్యార్ధులు ఆడుకునే మైదానం ఖాళీ చేయమని వారిని పోలీసులు చితకబాదారు. ఈ ఘటన మణిపూర్ లో చోటుచేసుకుంది. విద్యార్ధులు తెలిపిన వివరాల ప్రకారం... క్యాంపస్ లోని వాలీబాల్ కోర్టులో చుట్టూ పక్కల గ్రామాల యువకులు ఆడుతుండగా.. తమ మైదానాన్ని ఖాళీ చేయాలని విద్యార్ధులు కోరారు. దీంతో స్థానికులు విద్యార్థులపై దాడికి దిగారు. బయటి వారిని ఎవరిని రానివ్వోద్దని స్థానికేతర విద్యార్ధులు తరగతులు బహిష్కరించారు. దీంతో అక్కడి రిజిస్ట్రార్..ర్యాపిడ్ ఫోర్స్ ని పిలిపించి విద్యార్ధులను విచక్షణారహితంగా కొట్టించారు. అడ్డుకోబోయిన తెలుగు ప్రొఫెసర్ అనిల్ ను కూడా తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనపై బీహార్ సిఎం నితీశ్ కుమార్, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు స్పందించి మణిపూర్ సిఎం కార్యాలయంలోని అధికారులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు.