బెంగుళూరు, నవంబర్ 09 : గనుల అక్రమార్కుడు గాలి జనార్ధన్ రెడ్డికి మరో షాక్ తగలనుంది. 2016 నోట్ల రద్దు తర్వాత తన కుమార్తె వివాహం ఘనంగా చేశారు. అయితే దేశవ్యాప్తంగా నోట్లు రద్దు జరిగిన కొన్ని రోజుల్లోనే ఇంత ఆడంబరంగా పెళ్లి చేయడానికి డబ్బులు ఎలా వచ్చాయనే విషయం పై దర్యాప్తు జరపాలని, బళ్ళారికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తపాలా గణేష్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అంతే కాకుండా అక్టోబర్ 25 న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సెక్షన్ ఆఫీసర్ అరవింద్ కుమార్, సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఎ.కె. శర్మకు లేఖ పంపారు. దీనితో ఏ క్షణంలోనైన సీబిఐ దర్యాప్తు జరిగే అవకాశం ఉంది.