హైదరాబాద్, నవంబర్ 09 : భవన నిర్మాణాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వారసత్వ రాజకీయాల గురించి స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన వారసులు ఎవరిని రాజకీయాల్లోకి తీసుకువచ్చే ఉద్దేశం లేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. “ రాజకీయాల్లో ఉంది చాలా కోల్పోయా, తొమ్మిది సార్లు పోటీ చేశా, అధికారంలో ఉన్నా.. లేకున్నా, నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు కార్యకర్తలతోనే గడిపేవాడిని. అసలు వ్యక్తిగత జీవితాన్ని చాలా కోల్పోయా” ఇదంతా చూసి కూడా తన వారసులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి వారిని కష్టపెట్టాలని లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్ట౦ చేశారు.