హైదరాబాద్, నవంబర్ 09 : అభివృద్ధి పనుల్లో తనదైన శైలిని ప్రదర్శించే కలెక్టర్ యోగితా రాణా తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల విషయంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతాన్ని పెంపొందించేందుకు పక్కా కార్యాచారణ రూపొందించి అందుకు అనుగుణంగా తగిన చర్యలను తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. ప్రసవాల శాతం తగ్గడానికి గల కారణాలను సమీక్షించి అవసరమైన మేర వసతులను కల్పించడానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ఎస్పీహెచ్వోల పరిధిలో ఉన్న ప్రైమరీ సెంటర్లను పరిశీలించి సమయపాలన పాటించని డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. అంతేకాకుండా డాక్టర్ల హాజరు రిపోర్టును ప్రతిరోజూ తనకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.