న్యూఢిల్లీ, నవంబర్ 08 : కేంద్ర విమానయానం లో ప్రయాణికుడిపై ఇండిగో విమానయాన సంస్థ సిబ్బంది దాడి చేసిన తీరుపై ఆ శాఖ మంత్రి అశోక్గజపతిరాజు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రయాణికుడిపై సిబ్బంది దాడిచేయడం బాధాకరమన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీసీఏ, ఇండింగో సంస్థలను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే ఈ నివేదిక రాగానే సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అక్టోబర్ 15న ఢిల్లీ విమానాశ్రయంలో చెన్నైకి చెందిన ప్రయాణికుడు వినయ్ కట్యాల్కు, సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగడంతో సిబ్బంది అతనిపై దాడి చేసినట్టు సోషల్ మీడియాలో ఫొటోలు హాల్ చల్ చేయడంతో ఈ విషయం పై తీవ్ర దుమారం రేపడంతో ఇండిగో సంస్థ క్షమాపణలు కోరడం జరిగింది.