న్యూ ఢిల్లీ, నవంబర్ 08 : ప్రస్తుతం టెలికాం రంగంలో టారిఫ్ వార్ నడుస్తుంది. జియో సంస్థ కు దీటుగా ఎయిర్ టెల్ ఎన్నో ఆఫర్లను తమ వినయోగాదారులకి అందిస్తుంది. తాజాగా డేటా రోల్ ఓవర్ సర్వీస్ కుడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఇదే బాటలో ప్రముఖ టెలికాం దిగ్గజం వొడాఫోన్ తమ యూజర్లకు డేటా రోల్ ఓవర్ ఆఫర్ తో ముందుకొచ్చింది. అయితే ఈ ఆఫర్ రెడ్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు వర్తిస్తుంది. వీటిని రెడ్ ట్రావెలర్, రెడ్ ఇంటర్నేషనల్, రెడ్ సిగ్నేచర్ ప్లాన్లుగా విభజన చేసింది. రెడ్ ప్లాన్ లో భాగంగా 200 జీబీ వరకు మిగిలిపోయిన డేటాను తిరిగి వాడుకోవచ్చు. అంతే కాకుండా నేషనల్ రోమింగ్ ఉచితం. దీనితో పాటు వొడాఫోన్ ప్లే ద్వారా సినిమాలు, లైవ్ టీవీని ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు. రెడ్ ట్రావెలర్ ఆర్ పధకంలో రూ.499 తో 20 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్లు , ప్లాన్ ఎంలో రూ.699 రెంటల్ పై 35 జీబీ డేటా, ప్లాన్ ఎల్ లో రూ.999 రెంటల్పై 50 జీబీ డేటా పొందవచ్చు. వొడాఫోన్ రెడ్ ఇంటర్నేషనల్ ఆర్ ప్లాన్లో రూ.1299 రెంటల్పై 75 జీబీ డేటా 100 ఎస్సెమ్మెస్లు, వంద ఐఎస్డీ కాల్స్ నిమిషాలు లభిస్తాయి. ఎం ప్లాన్లో రూ.1699పై 100 జీబీ డేటా, ఎల్ ప్లాన్లో రూ.1999పై 300 ఉచిత ఐఎస్డీ కాల్స్, 125 జీబీ డేటా లభిస్తాయి. రెడ్ సిగ్నేచర్ ప్లాన్లో వినియోగదారులు 200 ఉచిత ఐఎస్డీ నిమిషాలు, 200 జీబీ డేటా లభిస్తాయి. ఇందులో రెడ్ ట్రావెలర్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్లోని వినియోగదారులకు వర్తించదు.