హైదరాబాద్, నవంబర్ 08 : కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తానూ ఎమ్మెల్యేగా గెలవలేకపోతే ఇక తెలంగాణలో తిరగలేనని ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోమటి రెడ్డి “రానున్న ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తా. ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్లే ఉద్దేశం లేదు” అని స్పష్టం చేశారు. ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన కంచర్ల సోదరులకు తనను ఓడించే౦త సీన్ లేదన్నారు. కాగా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ తదితర కలుషితాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారందరిని ఆదుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.