మహారాష్ట్ర, నవంబర్ 8 : సమాజంలో డేరా బాబాలు ఒకోక్కరిగా పుట్టుకొస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. మహారాష్ట్ర లో మరో బాబా కొలువు తీరాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానేకి చెందిన సాయిలాల్ జెధియా అనే వ్యక్తి, తను సాధువు అని ప్రకటించుకొని, భక్తి పేరుతో, అక్కడికి వచ్చే ప్రజలను మోసం చేస్తుండేవాడు. అంతేకాదు వైద్యులకు కూడా నయం కానీ ప్రాణా౦తకమైన రోగాలను నయం చేస్తానని చెప్పి వారీ దగ్గర నుండి డబ్బులు దోచుకోవడం తన నైజం. ఈ క్రమంలో ఓ మహిళ ఆయనను ఆశ్రయించగా, ఆమెను "నువ్వు నా గత జన్మలో భార్యవి" అంటూ మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. ఈ నేపధ్యంలో గత నెల ఆమెను అసోం తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు సాయిలాల్. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకొని వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నెల రోజుల తర్వాత ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. విషయాన్నీ విచారించగా... ఆమె నాకు గత జన్మలో భార్య, అందుకే ఆ విధంగా ప్రవర్తించాను అంటూ చెప్పుకొచ్చాడు సాయిలాల్ సాధువు.