తిరువనంతపురం, నవంబర్ 07 : కివీస్ తో జరగనున్న చివరి పోరు కోసం తిరువనంతపురంలో టీమిండియా ఆటగాళ్ళు సాధన చేస్తూ, ఖాళీ సమయంలో ఉత్సహంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కోహ్లీ, హార్దిక్పాండ్య, శిఖర్ ధావన్ సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో ను పాండ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే కాకుండా దీనికి ‘బాయ్ బ్యాండ్ వైబ్స్’ ట్యాగ్ లైన్ ను జత చేశాడు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలుచుకొని 1-1తో కివీస్, భారత్ సమంగా ఉన్నాయి.