టీడీపీ కార్యాలయ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు

SMTV Desk 2017-11-07 17:23:42  TDP AP State Office Building, schedule fix, Nara Lokesh.

అమరావతి, నవంబర్ 07 : టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యాలయ భవన నిర్మాణ ఆకృతులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళావెంకట్రావు, మంత్రి పి.నారాయణ, తదితరులు హాజరై ఈ ఆకృతుల గురించి చర్చించారు. ఇందు నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఒకసారి చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఈ నెల 26న ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఈ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.