విజయవాడ, నవంబర్ 07: ఒకప్పుడు తన అందచందాలతో అభినయించి తమిళ, తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన వాణీ విశ్వనాథ్, ప్రస్తుతం ప్రజా సేవ చేసేందుకు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టిడిపిలో చేరక ముందే ప్రత్యర్ద పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అస్త్రాలు సంధిస్తున్నారు. వ్యక్తిగతంగా నాకు రోజాకు ఎలాంటి పోటీ లేదన్న ఆమె, రోజాను ఎదుర్కోగల సత్తా ఉందన్నారు. ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం ఇచ్చేంత తెలుగు వచ్చన్నారు. పాపాలు పోవడానికే వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారంటూ చురకలు అంటించారు. ఈ రోజు చంద్రబాబును కలిసే అవకాశం ఉందని తెలిపారు. టిడిపిలో చేరిన తరువాతే మిగతా విషయాల గురించి మాట్లాడతానని, మొదట ఆ పార్టీలో చేరాల్సి ఉందని చెప్పారు.