హైదరాబాద్, నవంబర్ 07 : నల్గొండకు చెందిన తెదేపా నేతలు కంచర్ల సోదరులు భూపాల్ రెడ్డి, కృష్ణ రెడ్డి తెరాసాలో చేరారు. హైదరాబాద్ తరలి వచ్చి కార్యకర్తలతో కలిసి గులాబీ కండువా వేసుకున్నారు. మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, జగదీష్ సమక్షంలో తెరాసాలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.