కీలక ప్రకటన చేసిన ఎయిరిండియా..

SMTV Desk 2017-11-07 11:37:07  Air India Sensational statement, Central home department, Travel agent company.

న్యూఢిల్లీ, నవంబర్ 07 : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా వేలకోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఈ రుణభారాన్ని తగ్గించేందుకు ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ క్రమంలో ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులు ఏదైనా అధికారిక పర్యటనలకు వెళ్ళినప్పుడు కేవలం ఎయిరిండియాలో మాత్రమే ప్రయాణించాలని కేంద్ర హోంశాఖ తమ సిబ్బందికి సూచించింది. టికెట్లు కూడా ఎయిరిండియా అధికారిక ట్రావెల్‌ ఏజెంట్‌ సంస్థల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని పేర్కొంది. దీనికి కారణం ఉందండోయ్.. అధికారుల పర్యటన ఖర్చులను ప్రభుత్వం భరిస్తున్న నేపథ్యంలో ఈ నియమాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు దీని వల్ల ఎయిరిండియాకు కూడా లాభదాయకంగా ఉంటుందని వివరించారు. ఒకవేళ ఎవరైనా ఈ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హోంశాఖ స్పష్టం చేసింది.