జగన్ పాదయాత్రలో అపశ్రుతి

SMTV Desk 2017-11-06 17:32:12  paadayaatra desc, death in paadayaatra

ఇడుపులపాయ, నవంబర్ 06 : వైసీపీ అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా సంకల్ప యాత్ర" లో అపశృతి చోటు చేసుకుంది. తొలిరోజు ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ సమాధి వద్ద నివాళి అర్పించి, అనంతరం బహిరంగ సభ పాదయాత్ర ప్రారంభమైంది. అశేష జనవాహిని మధ్య ప్రారంభమైన ఈ యాత్రలో సీకే దిన్నెకు చెందిన వెంకటరమణ అనే కార్యకర్త గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జగన్, వెంకటరమణ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, యాత్ర సజావు గా జరిగేటట్లు చూసుకోవాలని జగన్ సూచించారు.