ముంబై, నవంబర్ 06 : ప్రస్తుత టెలికాం రంగంలో రిలయన్స్ జియో వల్ల ఇతర సంస్థలు తీవ్ర పోటీని ఎదుర్కొ౦టున్నాయి. తాజాగా ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఐడియా తమ వినయోగదారులకి అదిరే ఆఫర్ ని ప్రకటించింది. రూ.357తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ ద్వారా ఉచిత వాయిస్ కాల్స్, రోజు 1జీబీ 4జీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పథకం కాల పరిమితి 28 రోజులు. ప్రస్తుతం జియో రూ.399తో రీఛార్జ్ చేసుకుంటూ 70 రోజుల వ్యాలిడిటితో రోజుకు 1జీబీ ఉచిత డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ సదుపాయం కల్పిస్తుంది.