న్యూఢిల్లీ, నవంబర్ 06 : ప్రస్తుత టెలికాం రంగంలో జియో నుండి ఎయిర్టెల్ తీవ్ర పోటీని ఎదుర్కొంటుంది. అయితే తాజాగా ప్రస్తుత జియో రూ.399 ప్లాన్ కు దీటుగా ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్ వినయోగదారుల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 448 తో రీఛార్జి చేస్తే రోజుకు 1 జీబీ డేటాను 70 రోజుల పాటు అందించనుంది. అయితే వాయిస్ కాల్స్ లో మాత్రం రోజుకి 250 నిముషాలు మాత్రమే మాట్లాడేలా ప్లాన్ ప్రవేశపెట్టారు. ఒక వేళ వినయోగాదారుడు 200 నిముషాలు వాడుకుంటే మొదటి ఐదు రోజుల తర్వాత ఉచిత టాక్ టైంను క్రెడిట్ చేస్తారు. ఈ పథకం ద్వారా రోజుకు 100 ఉచిత సందేశాలు కూడా లభించనున్నాయి.