పాదయాత్రపై స్పందించిన విజయమ్మ..

SMTV Desk 2017-11-05 16:35:54  YS Jagan padayatra, ys vijayamma, comments.

హైదరాబాద్, నవంబర్ 05 : ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ పాదయాత్రపై ఆయన మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ స్పందించారు. జగన్ పాదయాత్రను ప్రజలు ఆశీర్వదించి, విజయవంతం చేయాలని ఆమె కోరారు. పాదయాత్ర అనేది చాలా కష్టమైనదని, అయినా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, షర్మిల పాదయాత్రలు చేసిన విషయాలను ఆమె గుర్తుచేశారు. తాను జగన్ ను ప్రజల చేతిలో పెట్టానని, మీరే జగన్ ను అక్కున చేర్చుకోవాలని ఆమె తెలిపారు. జగన్ పాదయాత్రకు అడ్డంకులు పెట్టాలని కూడా ప్రయత్నాలు జరిగాయని, జగన్ పాదయాత్రపై టిడిపి భయపడుతోందన్నారు. రాజశేఖరరెడ్డి చేపట్టిన అనేక సంక్షేమ పధకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని, ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి అందరికి రోల్ మోడల్ అన్నారు. జగన్ కూడా అంత మంచి పాలన ఇస్తాడన్న నమ్మకం తనకు౦దని, జగన్ ను ముఖ్యమంత్రి చేసే వరకు ఎవరు విశ్రమించబోవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.