భోపాల్, నవంబర్ 5 : "కామంధులను వదిలి పెట్టొద్దు.. వారిని నడి రోడ్డు మీద ఉరి తీయండి" అంటూ అత్యాచారానికి గురైన బాధితురాలు డిమాండ్ చేసింది. భోపాల్ లో అత్యాచారానికి గురైన యువతి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. నాకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే మధ్యప్రదేశ్ పోలీసులు సహకరించలేదు. పోలీస్ స్టేషన్ల చుట్టూ నన్ను తిప్పించారని ఆవేదన వ్యక్తం చేసింది. భోపాల్లో మంగళవారం రాత్రి సివిల్స్ కోచింగ్ క్లాస్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న 19ఏళ్ల యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించడంతో ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అంతే కాదు విధులలో నిర్లక్ష్యం వహించిన వారిని సస్పెండ్ చేయగా, మరో అధికారిని బదిలీ చేశారు.