హైదరాబాద్, నవంబర్ 05: తెలంగాణాలో వ్యవసాయాన్ని పండగ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మూడు పాత జిల్లాల పరిధిలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తున్న సర్కార్, సోమవారం రాత్రి నుండి రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలను పూర్తిగా నిర్మూలించాలని, రైతును రాజుగా చేసే వరకు విశ్రమించే పని లేదని కేసీఆర్ పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో 17 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసి రైతులకు రుణ విముక్తి కల్పించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నుంచి శాశ్వతంగా వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ కల్పి౦చాలని సీఎం అధికారులకు సూచించారు.