నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

SMTV Desk 2017-11-05 12:39:00  pig attack on child, south delhi, Aims Trauma Center

న్యూఢిల్లీ, నవంబర్ 5 : ఆ తల్లి దగ్గర నుండి 20 రోజుల తన బిడ్డను లాక్కొని తినేసింది పిశాచి పంది. ఈ ఘటన ఢిల్లీలోని భాటి మైన్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... పుష్ప అనే మహిళ తన బిడ్డకు పాలు ఇస్తున్న సమయంలో ఇంట్లోకి పంది ప్రవేశించి, ఆ శిశువును లాక్కొని పరిగెత్తింది. వెంటనే ఆ తల్లి పందిని వెంటాడింది, కానీ అప్పటికి కాస్త దూరం పరుగెత్తిన పంది, ఆ పసికందు తలను కొరికేసింది. చుట్టుపక్కల ఉన్న స్థానికులు అప్రమత్తమై ఆ పందిని బెదరగొట్టారు. కానీ అప్పటికే తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. పందుల స్వైర విహారం వల్లే తమ బిడ్డ చనిపోయింద౦టూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.