ముంబై, నవంబర్ : ప్రముఖ కార్పొరేట్ స్టోర్ సంస్థ వాల్మార్ట్ భారత్లో తన వ్యాపార నెట్వర్క్ను విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా త్వరలో మరో 30 స్టోర్లను ప్రారంభించనున్నట్లు వాల్మార్ట్ ఇండియా సీఈవో క్రిష్ అయ్యర్ తెలిపారు. ఇప్పటికే 19 నుంచి 20 స్టోర్లకు సంబంధించిన నిర్మాణాలపై ఒప్పందాలు జరిగిపోయాయని, ప్రస్తుతం వీటి నిర్మాణం వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవి పూర్తయ్యేటప్పటికి మరో 10 నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.