పట్నా, నవంబర్ 5 : "నితీశ్ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా స్కాముల్లో ఇరుక్కోవచ్చు. అయితే దాణా కుంభకోణం వార్తలు వచ్చిన సమయంలో కొందరు లాలూ గడ్డి తిన్నాడని అన్నారు. మరి ఇప్పుడు టాయిలెట్ స్కాం జరిగింది. మరి ఇప్పుడు నితీశ్ ఏం తిన్నాడని అంటారు"..? అంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ట్విటర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ స్కామ్ ఏంటంటే.. పట్నాలో మరుగుదొడ్లు కట్టిస్తామనే పేరుతో రూ.13.50కోట్ల నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అక్రమంగా దోచుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ సందర్బంగా నితీశ్ పై లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.