హైదరాబాద్, నవంబర్ 5 : పల్లెటూరి వాతావరణం నడుమ మెగా హీరో రామ్ చరణ్ కథానాయకుడిగా "రంగస్థలం" చిత్ర౦ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాపై మంచు మనోజ్ ఓ ట్వీట్ చేశారు. "నా అన్న రామ్ చరణ్ సాంగ్స్ వినిపించిన దగ్గర నుంచి.. రంగస్థలం నన్ను వెంటాడుతోంది. ఆడియో రిలీజ్, మూవీ కోసం వెయిట్ చెయ్యలేకపోతున్నాను" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో చరణ్ అభిమానులు కూడా ఆడియో కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దీన్ని బట్టి రంగస్థలం పాటలు ఏవిధంగా అలరిస్తాయో అర్థమవుతుంది.