కంగ్రా, నవంబర్ 04 : ఈ నెల 9న హిమాచల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కంగ్రా ప్రచార ర్యాలీలో భారత ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిమాచల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓటమిని ఒప్పుకునే౦దునే ప్రచారానికి కూడా రావట్లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ను ఆయన విధిరాతకు వదిలేసి పార్టీ సీనియర్ నేతలంతా రాష్ట్రంలో ప్రచారానికి దూరంగా ఉంటున్నారని మోదీ విమర్శల వర్షం కురిపించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత వారి వద్ద ఉన్న నల్లధనాన్ని బయటకు తీశానని, తనపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారంటూ ప్రధాని వారిపై దుయ్యబట్టారు.