వాషింగ్టన్, నవంబర్ 04 : ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ సహాయమంత్రిగా ప్రముఖ న్యాయవాది మనీషా సింగ్ నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది. సెనేటర్ డాన్ సలివన్కు ముఖ్య న్యాయవాదిగా, సీనియర్ విధాన సలహాదారుగా ఇప్పటివరకు విధులు నిర్వర్తించిన మనీషా, దేశ ఆర్థిక దౌత్య వ్యవహారాలకు ఇన్ఛార్జ్ కానున్నారు.