అత్తమామలకి విషమిచ్చి...ప్రియుడితో పరారైంది

SMTV Desk 2017-06-09 15:56:39  wife, lover, runaway

రాజస్థాన్, జూన్ 09 : పెళ్ళైన యువతి భర్తకు, అత్తమామలకు ఇంట్లో వారందరికీ విషమిచ్చి, కోడలు ఇంట్లోంచి ప్రియుడితో వెళ్లిపోయిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే మహేందర్ గుర్జర్ భార్య మమత వంట చేసి సమయంలో ఆ వంటలో విషం కలిపి అందరికి వడ్డించింది. తరువాత అందరు నిద్ర పోయాక ప్రియుడి తో కలిసి మమత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఉదయం 6 గంటలకు మహేందర్ గుర్జర్ కు మెలకువ వచ్చి లేచాడు. కుటుంబంలోని వారంతా ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. కాని మమత ఎక్కడ కనిపించలేదు. ఇంట్లోని వారందరిని లేపే ప్రయత్నం చేసిన వారు ఎంతకీ లేవలేదు అందరిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించిన అనంతరం వాళ్ళు కోలుకున్నారు. మహేందర్ గుర్జర్ పోలీసులకు వెళ్లి పిర్యాదు చేశాడు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.