వినయోగదారులకి ఆర్‌కామ్‌ షాక్..!

SMTV Desk 2017-11-04 12:27:20  RCOM, VOICE CALLS CLOSING, TRAI ANNOUNCE, ANIL AMBANI

న్యూఢిల్లీ, నవంబర్ 04 : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ (ఆర్‌కామ్‌) తన వాయిస్‌ కాల్‌ సర్వీసులను నిలిపివేయనుంది. నవంబర్‌ 30 నుంచి 2జీ, 3జీ మొబైల్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు ఇటీవల ఆర్‌కామ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ కేవలం 4జీ డేటా సర్వీసులను మాత్రమే తన కస్టమర్లకు అందించనుందని, తన సబ్‌స్క్రైబర్లకు ప్రస్తుతం అందిస్తున్న వాయిస్‌ సర్వీసులను 2017 డిసెంబర్‌ 1 నుంచి మూసివేస్తున్నట్టు ట్రాయ్‌ అన్ని టెలికాం ఆపరేటర్లకు సూచించింది. సుమారు రూ.44 వేలకోట్ల రుణభారంతో సతమవుతున్న ఈ సంస్థ ఎయిర్‌సెల్‌తో విలీనం చేయాలనుకుంది. కానీ ఈ విలీనం అమలు కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా ఈ నిర్ణయం తీసుకుంది.