350 కేజీల గంజాయి పట్టివేత..

SMTV Desk 2017-11-03 17:30:21  Cannabis, police, east godavari

తూర్పుగోదావరి, నవంబర్ 3 : జిల్లాలో జాతీయ రహదారిపై గంజాయి దుండగులను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం, రామవరం వద్ద జాతీయ రహదారిపై 350 కేజీల గంజాయిని, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. కాగా ఈ ఘటనలో ఐదుగురు దుండగులను అరెస్టు చేశారు.