గాలి జనార్ధన్ కు హైకోర్టు షాక్

SMTV Desk 2017-11-03 16:09:50  G. Janardhana Reddy, london journey, high court shocking news.

హైదరాబాద్, నవంబర్ 03 : మైనింగ్ మాఫియా అధినేత, ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితుడు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డికి హైకోర్ట్ షాక్ ఇచ్చి౦ది. తన కుమార్తె బ్రాహ్మణి వివాహ వార్షికోత్సవానికి లండన్ వెళ్లేందుకు ఈ నెల 5 నుండి 20 వరకు అనుమతించాలని పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్ట్ తోసిపుచ్చి౦ది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన సీబీఐ న్యాయవాది, జనార్దన్ రెడ్డి లండన్ వెళితే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, గతంలో బ్యాంకులను మోసగించి లండన్ వెళ్లిన విజయ్ మాల్యా తిరిగి రాలేదని కోర్ట్ కు గుర్తు చేశారు. ఈ వాదనలను పరిశీలించిన హైకోర్ట్, సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ గాలి జనార్దన్ రెడ్డి లండన్ ప్రయాణానికి అనుమతి నిరాకరించింది.