న్యూఢిల్లీ, నవంబర్ 03 : ప్రముఖ సామాజిక మాద్యమమైన వాట్సాప్ మెసేజింగ్ యాప్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ క్రాష్ డౌన్ అయిందన్న వార్తలతో వినియోగాదారులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ రోజు ఉదయం నుండి సందేశాలు పంపిన, వీడియోలు పంపిన ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో యూజర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆందోళనపై వాట్సాప్ మాతృ సంస్థ అయిన ఫేస్ బుక్ ఎటువంటి ప్రకటన చేయలేదు.