ఎన్టీపీసీ పేలుడు ఘటనలో 32 కి చేరిన మృతులు

SMTV Desk 2017-11-03 15:22:41  NTPC BLAST IN RAYABARELI, 32 MEMBERS PASSED AWAY, UTTARA PRADESH, NTPC CHAIRMAN GURDIP SINGH

లక్నో, నవంబర్ 03 : ఉత్తరప్రదేశ్ లోని రాయి బరేలి ప్రాంతంలో జాతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎన్టీపీసీ) బాయిలర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 32కు చేరింది. ఈ రోజు చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు విడిచారని ఎన్టీపీసీ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గుర్దీప్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం యూపీ ప్రభుత్వానికి ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రమాదం సమయంలో నమోదైన దృశ్యాలను ఎవరో ఒక వ్యక్తి తన చరవాణిలో చిత్రీకరించి ఆన్ లైన్ లో పెట్టాడు. ఆ సమయంలో అక్కడ పనిచేసిన వారు ప్రాణ భయంతో చేసిన హాహాకారాలు, ఆరుపులు అందులో వినిపిస్తున్నాయి.