అక్షర్ ధామ్ ఆలయంలో మోదీ

SMTV Desk 2017-11-03 14:54:40  president modhi, visited to akshar dham temple, gujarath tour,

అహ్మదాబాద్, నవంబర్ 03 : గుజరాత్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్ అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఇప్పటికి ఈ ఆలయాన్ని నిర్మించి 25 ఏళ్ళు అయిన సందర్బంగా ఆయన ఈ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో మహంత్ స్వామి మహారాజ్ తో కలిసి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వామి నారాయణ్ సంస్థ అధిపతి ప్రముఖ్ స్వామీజీ మహారాజ్ సేవల్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తానెప్పుడు స్వామి మహారాజ్ మార్గదర్శకానికి విలువనిస్తానని మోదీ తెలిపారు.