న్యూఢిల్లీ, నవంబర్ 03 : రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ మరో తీపికబురు అందించింది. మొదట ఐఆర్సీటీసీ సంఖ్య 6 గా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల రైల్వే శాఖ ఐర్సీటీసీలో తమ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకున్న ప్రయాణికులు ఒకే నెలలో ఇకపై 12 టికెట్లు వరకు బుక్ చేసుకునే సౌలభ్యం కల్పించింది. ఈ విధానం అక్టోబర్ 26 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఐఆర్సీటీసీ అధికారులు వెల్లడించారు. టికెట్ బుకింగ్ విషయంలో మోసాలను అరికట్టేందుకు ఐఆర్సీటీసీ ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆరు కంటే ఎక్కువ టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారు తమ ఆధార్ నెంబర్ వివరాలను ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వెబ్సైట్లోని ఆధార్ కేవైసీ ఆప్షన్పై క్లిక్ చేసి మై ప్రొఫైల్ కేటగిరీలో అప్డేట్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మొబైల్కి వచ్చిన ఓటీపీ(వన్టైమ్ పాస్వర్డ్)ను ఎంటర్ చేస్తే అప్డేట్ అవుతుంది. ప్రస్తుతం ఐఆర్సీటీసీలో జనరల్ కోటాలో ఒక టికెట్పై ఆరుగురు ప్రయాణించే వెసులుబాటు ఉంది. తత్కాల్ విషయంలో మాత్రం ఒక టికెట్పై నలుగురు ప్రయాణానికి అనుమతిస్తారు.