మరో రెండు రికార్డుల ముంగిట "రన్ మెషిన్"

SMTV Desk 2017-11-03 13:26:32  VIRAT KOHLI , BREAKING TO TWO RECORDS IN T-20, INDIAN CRICKET TEAM CAPTAIN, RAJKOT, NEW DELHI

రాజ్ కోట్, నవంబర్ 03 : ప్రముఖ క్రికెటర్, టీమిండియా సారధి విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పరుగుల వీరుడు మరో రెండు రికార్డులకు దగ్గరగా చేరువయ్యాడు. అందులో ఒకటి అంతర్జాతీయ T-20 ల్లో రెండువందల ఫోర్లు సాధించడానికి కేవలం ఒక ఫోర్ మాత్రమే చేయాలి. ఈ ఒక్క ఫోర్ తో ఆ ఘనత సాధించిన మూడో క్రికెటర్ గా విరాట్ గుర్తింపు పొందుతాడు. ఇంతకు ముందు ఈ ఘనతను సాధించిన ప్లేయర్ లుగా దిల్షాన్(223), ఆఫ్ఘన్ ఆటగాడు మొహ్మద్ షహజాద్(200) ముందున్నారు. ఢిల్లీలో కివీస్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లి మూడు సిక్సర్లతో, ఓక్క ఫోర్ కొట్టని కారణంగా ఈ ఫీట్ ను మిస్సయ్యాడు. మరొక వైపు అంతర్జాతీయ T-20ల్లో కోహ్లి అత్యధిక పరుగులు సాధించడానికి 11 పరుగులు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం కివీస్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ (2140) పరుగులతో మొదటి స్థానంలో ఉండగా, శ్రీలంక క్రికెటర్ తిలకరత్నె దిల్షాన్ (1889) పరుగులతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.