హైదరాబాద్, నవంబర్ 03 : తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "ఈ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ. నేను పిలిస్తే ఇంతమంది వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీకు నాకు ఉన్న అనుబంధాన్ని ఎవరు విడదీయలేరు. మనది తెలుగుదేశం కుటుంబం. పార్టీకి సంక్షోభాలు కొత్తేం కాదు తెలంగాణలో తెదేపాకు మంచి భవిష్యత్తు ఉంది. ఎన్నికలప్పుడు ఏం చేయాలనే ఆలోచనలు వద్దు మీరు శ్రమించండి. నేను మీకు ఏం చేయాలో చెబుతా., ఇంతటి క్లిష్ట పరిస్థితులలో కూడా కేంద్ర పార్టీ కార్యాలయం కళకళలాడుతోందంటే మామూలు విషయం కాదు. ప్రారంభమే ఇలా అదిరిందంటే భవిష్యత్తుకు ఇకా డోకా లేదు. కార్యకర్తలకు అండగా నేను౦టా" అని భరోసా ఇచ్చారు.