భారత్ గెలుపు.. పాక్ కు అగ్రస్థానం

SMTV Desk 2017-11-02 18:32:18  ICC T-20 RANKINGS, PAKISTHAN- SOUTHAFRICA, INDIA, 5 TH PLACE

న్యూఢిల్లీ, నవంబర్ 02 : నిన్న ఢిల్లీలో కివీస్ తో జరిగిన T-20 మ్యాచ్ ను భారత్ జట్టు 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లి సేన సాధించిన ఈ విజయంతో పాకిస్తాన్ జట్టు ఐసీసీ ప్రకటించిన T-20 ర్యాంకింగ్ లో(124) పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది. అదేలా అనుకుంటున్నారా..! పాయింట్లు పరంగా పాక్-న్యూజిలాండ్ మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. ఇటీవల పాక్ శ్రీలంక తో జరిగిన T-20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుత ఓటమితో కివీస్(121) పాయింట్లు కోల్పోయి రెండో స్థానంలోకి పడిపోయింది. దీంతో T-20 టీం ర్యాంకింగ్స్‌లో పాక్‌ అగ్రస్థానం దక్కించుకొంది. ప్రస్తుతం విరాట్ సేన T-20 జట్టు ర్యాంకింగ్ లో ఐదో స్థానంలో ఉంది.