ముంబై, నవంబర్ 02 : ప్రపంచ మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ బుధవారం తన 44వ పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా ఐష్ గురించి అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకి అభిమానులంటే చాలా గౌరవమని తన సతీమణి గురించి గర్వంగా చెప్పుకొచ్చారు. ఆరాధ్య పుట్టిన తర్వాత ఐశ్వర్య లావైపోయిందని కొంత మంది కామెంట్లు చేస్తూ తప్పుడు కథనాలు రాశారు. అది నన్ను చాలా బాధించింది. ఇదే విషయం గురించి ఐష్కి చెబితే.. ‘ఇలాంటివన్నీ ఎక్కువ రోజులు ఉండవు’ అని చెప్పేది. ఈ రోజుకీ ఆమెను ప్రపంచంలోనే అందమైన మహిళగా భావిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కాగా, పుట్టినరోజు సందర్భంగా ఐష్ తన తల్లి వృందా రాయ్, కుమార్తె ఆరాధ్యతో కలిసి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించింది. ప్రస్తుతం ఐష్ ‘ఫ్యానీ ఖాన్’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఐష్కి జోడీగా రాజ్కుమార్ రావ్ నటిస్తున్నారు. అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.